- Advertisement -
సీనినటుడు డైలాగ్ కింగ్ సాయికుమార్ మరోసారి నిరాశే ఎదురైంది.సాయికుమార్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బిజేపి పార్టీ తరుపున నిలబడిన సాయికుమార్కు ఘోరంగా ఓడిపోయారు.ఏపీ సరిహద్దులో ఉన్న బాగేపల్లి నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన ఆయనను ఓటర్లు తిరస్కరించారు.
సాయికుమార్కు కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు.2008 ఎన్నికల్లో సైతం ఇదే స్థానం నుంచి సాయికుమార్ ఓటమిపాలయ్యారు.సిట్టింగ్ ఎమ్మెల్యే చేతిలో ఆయన చిత్తుగా ఓడిపోయారు. ఆయన నాల్గోవ స్థానంలో నిలిచారు. ఎలెక్షన్కు ముందు సాయికుమార్ విజయంపై ధీమా వ్యక్తం చేశారు.కాని ఫలితాలు వచ్చిన తరువాత సీన్ రీవర్స్ అయింది.