- Advertisement -
తమిళ హీరో కార్తి నటించిన చినబాబు చిత్రం తెలుగులోను విడులైన సంగతి తెలిసిందే. విడుదల రోజు నుండే సినిమాకు హిట్ టాక్ వచ్చింది.మొదటి నుంచి కార్తీకి తమిళంతో పాటు తెలుగులోను మంచి మార్కెట్ క్రియోట్ చేసుకున్నాడు.’చినబాబు’ గ్రామీణ నేపథ్యంతో కూడిన కథ కావడంతో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.తెలుగు రాష్ట్రాల్లో తొలిమూడు రోజుల్లో ఈ సినిమా 2.74 కోట్ల రూపాయల షేర్ ను వసూలు చేసింది. రైతు పాత్రలో కార్తీ మంచి నటనను కనబరిచాడనే టాక్ వచ్చింది.
ప్రస్తుతం థియేటర్లలో ‘ఆర్ ఎక్స్ 100’ దుమ్మురేపేస్తుండటం వలన, ఈ సినిమా వసూళ్లపై కొంత ప్రభావం పడిందని చెప్పుకుంటున్నారు. లేదంటే ఈ సినిమా ఈ మూడు రోజుల్లో మరిన్ని వసూళ్లు రాబట్టి ఉండేదనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమాలో కార్తీకి జోడిగా సాయేషా సైగల్ నటించింది.