జబర్దస్త్ ఫేం హైపర్ ఆది కామెంట్స్ పై సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ మండిపడ్డ సంగతి తెలిసిందే. వారి మధ్య రోజురోజుకో విమర్శలు, ప్రతి విమర్శలు జరుగుతూనే ఉన్నాయి. అయితే వాటన్నింటిని పక్కన పెట్టి ఇప్పుడు ఇద్దరూ ఒకటయ్యారు. ఇది జరిగి కొన్ని రోజులు కూడా గడవకముందే హైపర్ ఆదిని మహేశ్ కలిశాడు. హైదరాబాద్లో ఇటీవల జరిగిన ‘లండన్ బాబులు’ ప్రీమియర్ షోకు సినీ ప్రముఖులతో పాటు కత్తి మహేశ్, హైపర్ ఆది కూడా వచ్చారు. ఈ సందర్భంగా వారు కలిసి ఫొటోలు దిగారు. ఆ ఫొటోను సోషల్ మీడియాలో కత్తి మహేశ్ పోస్ట్ చేశాడు. ఫేసుబుక్లో ఆ ఫొటో పోస్ట్తో పాటు కింద కొన్ని వ్యాఖ్యలు చేశాడు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు ఓ సూచన చేశాడు.
“మేమంతా బాగానే కలిసి ఉంటాం. మా మధ్య వ్యక్తిగత వైరాలు ఉండవు. సిద్ధాంతాల పరంగా మాత్రమే విబేధాలు ఉంటాయి. ఈ విషయం తెలియక, అర్థం కాక ఫ్యాన్స్ అనే వాళ్లు వాళ్ల జీవితాలను నాశనం చేసుకుంటారు. నాయనలారా… మేలుకోండి. రేపో, మాపో పవన్ కల్యాణ్ను కలిసినా, ఇలాగే నవ్వుతూ ఫొటో దిగగలను. ఆ తర్వాత మీరే వెధవలు అవుతారు” అంటూ కామెంట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.