Friday, April 26, 2024
- Advertisement -

ప్రమాదంలో ఎడమ కన్ను చూపు కోల్పోయిన కత్తి మహేష్?

- Advertisement -

ప్రముఖ ఫిల్మ్‌ క్రిటిక్‌, నటుడు కత్తి మహేష్ 2 రోజుల క్రితం రోడ్డుప్రమాదానికి గురైన సంగతి మనకు తెలిసిందే. కారులో ప్రయాణిస్తున్న అతని కారు నెల్లూరు వద్ద లారీని ఢీ కొట్టిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే మొదటగా కత్తి మహేష్ ను నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ వైద్య పరీక్షల అనంతరం మెరుగైన చికిత్స కోసం చెన్నై అపోలో ఆసుపత్రికి తరలించారు.

ఈ ప్రమాదంలో కత్తి మహేష్ ప్రయాణిస్తున్న కారుకు ఎయిర్ బ్యాగులు తెరచుకున్నప్పటికీ అతడి ముక్కు, కళ్ళు భాగాలకు తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం కత్తి మహేష్ చెన్నై అపోలో ఐసియులో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా అతని ఆరోగ్య పరిస్థితిని వివరించిన డాక్టర్లు మెదడులో ఎటువంటి రక్తస్రావం జరగకపోవటం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని తెలిపారు.

Also read:కర్మ అంటూ కత్తి మహేష్ యాక్సిడెంట్ పై పూనమ్ కౌంటర్లు?

అయితే ప్రస్తుతం కత్తి మహేష్ ఆరోగ్య విషయానికి సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహేష్ కంటికి దెబ్బ తగలడం వల్ల అతని ఎడమ కన్ను చూపు పూర్తిగా కోల్పోయిందని, ఈ విషయాన్ని స్వయంగా డాక్టర్లు వెల్లడించినట్లు కత్తి మహేష్ మేనమామ మీడియాకు వెల్లడించారు.ఏది ఏమైనా కత్తి మహేష్ సంపూర్ణంగా ఆరోగ్యంతో తిరిగి రావాలని అభిమానులు, శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు.

Also read:సరికొత్త పాత్రలో సాయి పల్లవి స్పెషల్ వీడియో..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -