పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ – మహేష్ కత్తి వార్ తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇది పవన్ ఫ్యాన్స్కి తనకు మధ్య జరుగుతున్న వార్ కాదని, పవన్కు తనకు మధ్య వార్ అని మహేష్ కత్తి అన్నారు. నాలుగు నెలలుగా పవన్ అభిమానులు మానసికంగా వేధిస్తున్నా పవన్ ఎందుకు స్పందించడంలేదన్నారు. పవన్ ఒక్కసారి ప్యాన్స్కి చెబితే ఇంత రచ్చ జరిగేది కాదు కదాన్నారు.
తాను నటి పూనం కౌర్ ను ఏ విధంగానూ ఇబ్బంది పెట్టాలని భావించడం లేదని, అయితే, ఆమె ముందు తాను కొన్ని ప్రశ్నలను ఉంచాలని అనుకుంటున్నానని చెప్పిన కత్తి మహేష్, పవన్ కల్యాణ్ ను విమర్శిస్తే, ఆమెకు కోపం ఎందుకు వస్తోందన్న విషయమై తన వాదనను వినిపించాడు.
మీకు బ్రాండ్ అంబాసిడర్ పదవి ఎవరి వల్ల వచ్చింది? తిరుమలలో పవన్ కల్యాణ్ తో పాటు దేవుడి ముందు నిలబడి, ఒకే గోత్ర నామాలతో ఎందుకు పూజ చేయించుకున్నారో చెప్పగలరా? పవన్ మోసం చేశాడన్న భావనతో మీరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడితే, మిమ్మల్ని కాపాడింది ఎవరు? మీకు అప్పుడు హాస్పిటల్ లో చికిత్సకు ఎంత ఖర్చయింది? ఆ బిల్స్ కట్టిందెవరు? పవన్ కల్యాణ్ మీ అమ్మను కలిసి ఏం ప్రామిస్ చేశారు? అది నెరవేర్చారా? లేదా? డైరెక్టర్ త్రివిక్రమ్ అంటే మీకు ఎందుకంత కోపం. ఓ క్షుద్రమాంత్రికుడితో కలసి త్రివిక్రమ్ పూజలు చేస్తుంటే, అక్కడ మీరు ఏంచేశారు? ఈ ప్రశ్నలకు పూనం సమాధానం చెప్పాలని కత్తి మహేష్ డిమాండ్ చేశారు. తాను సంధించిన ప్రశ్నలకు సంబంధించి అన్ని ఆధారాలూ తన వద్ద ఉన్నాయని చెప్పారు.