Friday, May 3, 2024
- Advertisement -

అస‌లు బిగ్‌బాస్ విన్న‌ర్ కౌశ‌ల్ కాదంటున్న తేజశ్వి

- Advertisement -

బిగ్‌బాస్ రెండో సీజ‌న్ నిన్న‌టి(ఆదివారం)తో ముగిసింది.118 రోజుల పాటు ,జ‌రిగిన ఈ తెలుగు రియాల్టీ షోలో బిగ్‌బాస్ విన్న‌ర్‌గా కౌశ‌ల్ నిలిచిన సంగ‌తి తెలిసింది.షో మొద‌టి నుంచి కౌశ‌ల్ తన అధిప‌త్యాన్ని పూర్తిగా చూపిస్తు వ‌చ్చాడు.స‌గం రోజులు గ‌డిచే సరికే బిగ్‌బాస్ విన్న‌ర్ ఎవ‌ర‌నేది తెలిసిపోయింది.హౌస్‌లో కౌశ‌ల్‌ను ఒంట‌రిని చేసి మిగ‌త ఇంటి స‌భ్యులంద‌రు గేమ్ ఆడిన విధానాన్ని చూశాం.కౌశ‌ల్ బిగ్‌బాస్ విన్న‌ర్ కావ‌డం కొంద‌రు హౌస్‌మెట్స్‌కు ఇష్టం లేదు.అయితే ఈ షోలో మొదటి నుంచి కూడా కౌశల్ కు వ్యతిరేకంగా ఉన్న మరో కంటెస్టెంట్ తేజశ్వి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.

అమిత్, పూజ, భానుశ్రీ, రోల్ రైడ, గణేష్, శ్యామల, గోగి బాబునేనిలు ఉన్న ఫొటోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి… అసలు విజేతలు వీరేనంటూ కామెంట్ పెట్టింది. ఈ వ్యాఖ్యలపై కౌశల్ ఆర్మీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది.చాలా చీప్, స్టుపిడ్, షేమ్ లెస్. మరొకరి విజయాన్ని అభినందించలేకపోతోంది. మన కౌశల్ మీద అసూయతో ఏడ్చి చచ్చిపోతోంది. నువ్వు ఈ గేమ్‌లో కాదు ,నిజ జీవితంలో కూడా విజ‌యం సాధించ‌లేవు.అంటూ తేజ‌స్వి మీద కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -