తెలుగు రియాల్టీ షో బిగ్బాస్ రెండో సీజన్ ముగిసి చాలా చాలారోజులు అయినప్పటికి కంటెస్టెట్ల మధ్య ఇంకా మాటల యుద్ధం జరుగుతునే ఉంది.బిగ్బాస్ విన్నర్గా కౌశల్ నిలవడం హౌస్మెట్స్కి చాలామందికి ఇష్టం లేదు.ముఖ్యంగా తేజస్వి మదివాడకు కౌశల్కు మధ్య తరచూ ఏదొక విషయంలో గొడవ పడుతూనే ఉండేవారు.అదే కోపాన్ని బయటకి వచ్చిన తరువాత కూడా తేజస్వి కంటిన్యూ చేసింది. బిగ్బాస్ ఫైనల్కు ఇంటి సభ్యులందరు తిరిగి హౌస్లోకి వెళ్లినప్పుడు కూడా తేజస్వి కౌశల్తో పెద్దగా మాట్లాడలేదు.దీనిపై బిగ్బాస్ విన్నర్ కౌశల్ స్పందించాడు.
తేజస్వి హౌస్లోకి వచ్చిన తరువాత నాతో మాట్లడలేదు.పైగా తనీష్ని వెంటపెట్టుకుని కెమెరా ముందుకి వెళ్లి మరి నా గురించి అవమానకరంగా మాట్లాడిందని చెప్పుకొచ్చాడు కౌశల్.దీంతో నేను వెంటనే తనీష్,సామ్రాట్ల దగ్గరికి వెళ్లి తేజస్వి అలా చేయడం కరెక్ట్ కాదని చెప్పాను,ఆ ఎపిసోడ్ను బిగ్బాస్ యాజయాన్యం టెలికాస్ట్ చేయలేదు.ఇటువంటి సంఘటనలను బిగ్బాస్ హౌస్లో చాలానే ఉన్నాయి,వాటిని కూడా ప్రసారం చేయలేదని చెప్పుకొచ్చాడు బిగ్బాస్ విన్నర్ కౌశల్.