Thursday, March 28, 2024
- Advertisement -

ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన ర‌చయిత కోన వెంక‌ట్‌

- Advertisement -

న‌టుడు, జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై సినీ ర‌చయిత కోన వెంక‌ట్ సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు.పవన్ కళ్యాణ్ ఇటీవల తెలంగాణ ప్ర‌భుత్వం అక్క‌డ ఉన్న ఆంధ్రా వాళ్ల‌ను కొట్టి చంపేస్తున్నార‌నే కామెంట్స్ చేశారు. ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌ను రాజ‌కీయ నాయ‌కులు ఖండిస్తున్నారు. తాజాగా ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై సినిమా ఇండ‌స్ట్రీ వారు కూడా స్పందిస్తున్నారు. ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై సినీ ర‌చ‌యిత కోన వెంక‌ట్ స్పందించారు. ఈ క్రమంలో ప్రముఖ రచయత కోన వెంకట్ పలు అంశాల్లో పవన్ వైఖరిపై విమర్శలు గుప్పించారు. అవినీతి, అక్రమాలపై గతంలో మంగళగిరి, కాకినాడ సభల్లో పవన్‌కల్యాణ్‌ చేసిన ప్రసంగానికి ప్రజలతో పటు తాను కూడా హర్షించానని అన్నారు. కాని ఇప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌వ‌ర్తిస్తున్న తీరుపై అంద‌రికి అనుమానం క‌లుగుతోంది. ప‌వ‌న్ చంద్ర‌బాబుకు తొత్తుగా ప్ర‌వ‌ర్తిస్తున్నారని ఆయ‌న మండిపడ్డారు.

ఎందుకు వైఎస్‌ జగన్‌ను లక్ష్యంగా చేసుకుని పవన్‌ విమర్శలు చేస్తారో అర్ధం కాదు. చంద్రబాబును ఏమాత్రం ప్ర‌శ్నించ‌కుండా , ప్ర‌తిప‌క్షంలో ఉన్నా జ‌గ‌న్‌ని ప్ర‌శ్నించ‌డం ద్వారా ఆయ‌న వైఖ‌రి ఏంటో అంద‌రికి అర్థం అయింద‌ని చెప్పుకొచ్చారు. ఈ సందర్బంగా జగన్ పై చేస్తున్న ఆరోపణల్లో ఒక్కదానికైనా పవన్ కళ్యాణ్ ఆధారాలు చూపించాలని అన్నారు, అలా చేస్తే తాను జనసేన జెండా మోస్తూ పవన్ వెంటే తిరుగుతానని అన్నారు. ఆంధ్రావాళ్లు హైద‌రాబాద్‌లో బాగానే ఉన్నార‌ని ప‌వ‌న్ లాంటి వ్య‌క్తులు చెప్పే మాట‌లు న‌మ్మి ప్ర‌జ‌లు మోసం పోవ‌ద్ద‌ని ఆయ‌న ప్ర‌జ‌ల‌ను కోరారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌కు ఓటు వేసి ఆయ‌న్ని ముఖ్య‌మంత్రిని చేయ‌ల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -