టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని హీరోగా తమిళ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో నిర్మాణం జరుగుతోంది. కోవిడ్ కారణంగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది. అయితే ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో మాధవన్ విలన్ గా నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే రామ్ సినిమాలో తాను నటించడం లేదంటూ తాజాగా మాధవన్ క్లారిటీ ఇచ్చాడు.
సఖి సినిమాతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన మాధవన్ కు ఆ సినిమా మంచి విజయం సాధించడంతో యూత్ లో క్రేజ్ తెచ్చుకున్నాడు. వరుసగా లవర్ బాయ్ పాత్రలు చేసి తమిళనాడులో చాక్లెట్ బాయ్ గా పేరు తెచ్చుకున్నాడు. ఆ సమయంలో లింగుస్వామి దర్శకత్వంలో మాధవన్ చేసిన రన్ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాతో మాధవన్ మాస్ లోనూ క్రేజ్ తెచ్చుకున్నాడు.
Also Read: క్రిష్కు షాకిచ్చిన పవర్ స్టార్.. విషయం ఏమిటంటే?
లింగుస్వామి,మాధవన్ కు ఉన్న సాన్నిహిత్యం కారణంగా రామ్ సినిమాలో విలన్ గా చేయాలని కోరగా, అందుకు ఆయన అంగీకరించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై మాధవన్ క్లారిటీ ఇస్తూ.. లింగుస్వామి తో పనిచేయడం ఎప్పుడూ తనకు ఇష్టమే..అని చెప్పిన మాధవన్ తాను తెలుగు సినిమాలో విలన్ గా నటిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశాడు.
Also Read: చెర్రీతో మాళవికా మోహనన్ రొమాన్స్..!