Thursday, May 16, 2024
- Advertisement -

‘రంగస్థలం’కు సైడ్ ఇచ్చిన ‘మహానటి’

- Advertisement -

‘మహానటి’ సినిమా వాయిదా

రెండు పెద్ద సినిమాలు థియేట‌ర్ల‌లోకి వ‌స్తున్నాయి.. పైగా వేస‌వి రావ‌డంతో సినిమా వాళ్ల‌కు పెద్ద పండ‌గే. ఈ స‌మ‌యంలో త‌మ సినిమా అంటే త‌మ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని చూస్తుంటారు. ఈ నేప‌థ్యంలో మార్చి 29వ తేదీకి బాగా డిమాండ్ ఏర్ప‌డింది. ఈ తేదీకి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రాంచరణ్, స‌మంత న‌టించిన ‘రంగస్థలం’ విడుద‌ల చేయాల‌ని ప్లాన్‌. ఇదే తేదీకి నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో అల‌నాటి అగ్ర హీరోయిన్ సావిత్రి జీవిత చ‌రిత్ర‌పై కీర్తి సురేశ్‌, స‌మంత‌, దుల్క‌ర్ త‌దిత‌రులతో రూపొందించిన‌ ‘మహానటి’ సినిమాను విడుద‌ల చేయాల‌ని ఫిక్స్ అయ్యారు. ఈ రెండింటి సినిమాల మ‌ధ్య పోటీ ఏర్ప‌డింది.

ఈ స‌మ‌యంలో ‘రంగస్థలం’ సినిమాకు ‘మహానటి’ సైడ్ ఇచ్చింది. మ‌హాన‌టి సినిమాను ఏప్రిల్‌ చివరి వారంలో విడుదల చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అయితే ఈ సినిమా వాయిదా ప‌డ‌డానికి రెండు కార‌ణాలు ఉన్నాయి. సినిమా పోటీ తీవ్ర‌త‌ను తగ్గించాల‌ని ఒక‌టి కాగా రెండో ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. అనుకున్న తేదీకి నాలుగు వారాలు మాత్రమే సమయం మిగిలి ఉండగా ‘మహానటి’ షూటింగ్ పూర్తి కాక‌పోవ‌డంతో ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నారు.

షూటింగ్‌ పూర్తయ్యి.. పోస్ట్ ప్రొడక్షన్.. ప్రమోషన్ ఇలా వీట‌న్నింటిని చాలా సమయం ప‌ట్టే అవ‌కాశం ఉండ‌డంతో ‘మహానటి’ సినిమాను వాయిదా వేసుకున్నారు. వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న చిత్రమిది. అశ్వినీదత్ అల్లుడు.. ‘ఎవడే సుబ్రమణ్యం’ దర్శకుడు నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్‌, మిగ‌తా పాత్ర‌ల్లో సమంత, దుల్కర్ సల్మాన్‌, శాలిని పాండే, మోహన్ బాబు, ప్రకాశ్‌రాజ్‌, విజయ్ దేవరకొండ తదిత‌రులు న‌టిస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -