అలనాటి నటి సావిత్రి జీవిత కథను మహనటి సినిమాగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే.సావిత్రి పాత్రను హీరోయిన్ కీర్తి సురేష్ పోషించింది.’మహానటి’ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే.మహనటిలో సావిత్రిగా కీర్తి సురేష్ నటనపై విమర్శకుల ప్రశంసలు అందాయి. అయితే సినిమా నిడివి ఎక్కువైందనే కారణంతో చాలా సన్నివేశాలను ఎడిట్ చేసేశారు. ఇప్పుడు అలా డిలీట్ చేసిన సన్నివేశాలను కూడా ఒక్కొక్కటిగా విడుదల చేస్తోంది చిత్రబృందం.
ఇప్పుడు విడుదల చేసిన సీన్లో జెమిని గణేశన్ ముగ్గరు భార్యలు,వారి పిల్లలు ఒకే ఫ్రేములో కనిపిస్తున్నారు.మొదట్లో ఈ సీన్ను సినిమాలో ఉంచుదాం అనుకున్నాడు చిత్ర దర్శకుడు.అయితే మళ్లీ ఈ సీన్ ఎక్కడ వివాదం అవుతుందో అని భయంతో సినిమా నుండి ఆ సీన్ను తొలగించారు.ఇప్పుడు ఆ సీన్ను యూట్యూబ్లో విడుదల చేశారు.రండీ ఆ సీన్ ఎలా ఉందో చూద్దాం.