- Advertisement -
మహేష్ తన 25వ సినిమాను ఈ రోజు(సోమవారం) మొదలు పెట్టాడు.ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డెహ్రాడూన్ లో ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది.ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు.సినిమాలో మహేష్ ఎంబీఏ స్టూడెంట్ గా కనిపించనున్నాడు.
ఈ సినిమా కోసం మహేష్ ఫస్ట్ టైమ్ ఫుల్ గెడ్డం.మీసంతో కనిపించనున్నాడు.ఈ సినిమాకు వంశీపైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు.దిల్ రాజు, అశ్వనీదత్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తుంది.