జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో తన స్టార్డమ్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు. ఇప్పుడున్న మార్కెట్ లో తనకంటే ప్రభాస్, మహేష్ లు పెద్ద స్టార్లని అన్నాడు. బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ .. “ప్రభాస్ నాకంటే పెద్ద హీరో .. పాన్ ఇండియా స్టార్. అలాగే మహేశ్ బాబు కూడా నాకంటే పెద్ద హీరో. పారితోషికం కూడా వారు నాకంటే ఎక్కువగానే తీసుకుంటారు.
రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రపంచ స్థాయికి ఎదిగి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. నాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లేదు. అలాగే చిరంజీవి, బాలకృష్ణ, అల్లు అర్జున్, ప్రపంచవ్యాప్తంగా తెలుసు నేను తెలియదు అన్నారు. అలాగే సినిమాలంటే వినోదం, ఆనందం అని, వాటిని రాజకీయాలతో కలపవద్దని పవన్ కల్యాణ్ అన్నారు. తనకు ఎన్టీఆర్, మహేష్, అల్లు అర్జున్, రామ్ చరణ్, చిరంజీవి, బాలకృష్ణ హీరోలందరూ ఇష్టమని చెప్పారు. తాను అందరి సినిమాలు చూస్తానని, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటానని పవన్ కళ్యాణ్ అన్నారు. వారితో నాకు ఎలాంటి సమస్యలు లేవు అని పవన్ అన్నారు.
రాజకీయాల్లో హీరోలపై ఉన్న ప్రేమను చూపించవద్దని హీరో అభిమానులందరికీ పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. సినిమాలు, రాజకీయాలు వేర్వేరుగా ఉంటాయని, సినిమాల్లో మీకు నచ్చిన హీరోతో సంబంధం లేకుండా రాజకీయాల్లోకి వెళ్లేటప్పుడు సమిష్టిగా ఆలోచించాలని అన్నారు. మిగతా హీరోల అభిమానులంతా తనకు మద్దతిచ్చి ఓటు వేయాలని పవన్ కళ్యాణ్ పరోక్షంగా కోరారు. తనలా పోరాడే వ్యక్తులను వదులుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Also Read: ఎమ్మెల్యేల మీటింగ్ లో జగన్ కీలక వ్యాఖ్యలు