తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే.అసోసియేషన్లో ఫండ్స్ కోసం సిల్వర్ జూబ్లీ వేడుకలు ప్లాన్ చేసింది మా అసోసియేషన్ . దీనిలో భాగంగానే చిరంజీవితో అమెరికాలో ప్రోగ్రామ్స్ చేయించారు. మహేష్ బాబు, ప్రభాస్ వంటి తారలతో ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి ఫండ్స్ కలెక్ట్ చేయాలని అనుకున్నారు. అమెరికా వెళ్లడం ద్వారా వచ్చిన డబ్బుని దుర్వినియోగం చేశారంటూ శివాజీరాజాపై ‘మా’ ప్రధాన కార్యదర్శి నరేష్ సంచలన ఆరోపణలు చేశారు.ఇరు వర్గాలు మీడియా సాక్షిగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో పాటు ,ఈ వివాదంలోకి మెగాస్టార్ చిరంజీవి పేరు కూడా తెర మీదకు రావడంతో సమస్య పెద్దదిగా మారింది.
ఇటువంటి పరిస్ధితులలో అమెరికాలో ఈవెంట్ చేయడం కరెక్ట్ కాదని భావించిన మహేశ్ బాబు తన ప్రొగ్రామ్ను రద్దు చేసుకున్నారు.ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడానికి మహేష్ స్వయంగా చిరంజీవికి ఫోన్ చేసి ఈ వివాదం సద్దుమణిగిన తరువాత డేట్ ఫిక్స్ చేస్తే తన సహకారం అందిస్తానని చెప్పాడట. మహేశ్ నరేష్తో మాట్లాడి రెండుగా చీలిపోయిన సభ్యులను ఒక వేదికపైకి తీసుకొచ్చి వారి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేస్తున్నాడని సమాచారం. మా అసోసియేషన్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న మహేశ్ను చిరు ప్రశంసించారట.