వాటే పెర్ఫార్మెన్స్ అంటూ పవన్ కల్యాణ్ను పొగత్తలతో ముంచెత్తాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్తో తెరకెక్కిన ‘భీమ్లా నాయక్’ చిత్రంపై మహేశ్ ట్వీట్ చేశాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ‘భీమ్లా నాయక్’. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది.
ఈ సినిమాని చూసిన పలువురు సెలబ్రిటీలు ట్విట్టర్ లో ప్రశంసలు కురిపించారు. తాజాగా మహేశ్ బాబు సైతం ఈ చిత్రంపై స్పందించాడు.‘‘ ‘భీమ్లా నాయక్’ చిత్రం అత్యద్భుతంగా ఉంది. తెరపై పవన్ కల్యాణ్ చెలరేగిపోయాడు. రానా దగ్గుబాటి డానియల్ శేఖర్గా సెన్సేషన్ క్రియేట్ చేశాడు. తెరపై ఆయన కనబడిన విధానం అద్భుతం. ఎప్పటిలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తన పవర్ చూపించారు.
ఈ మధ్యకాలంలో ఇదే ది బెస్ట్. నాకెంతో ఇష్టమైన సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్ తన విజువల్స్తో మాయ చేశారు.చివరగా, థియేటర్ నుండి బయటికి వచ్చినప్పటికీ థమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది.చిత్ర బృందం మొత్తానికి అభినందనలు అని మహేశ్ బాబు ట్వీట్ చేశాడు.