Friday, May 3, 2024
- Advertisement -

మహేష్ బాబు కోసం కొండారెడ్డి బురుజు

- Advertisement -

మహేష్ బాబు ప్రధాన పాత్రలో వచ్చే సంక్రాంతి కి విడుదల కానున్న చిత్రం సరిలేరు నీకెవరు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఇటీవలే జమ్మూ కాశ్మీర్ లో పూర్తి అయినా సంగతి మనకి తెలిసిందే. అయితే ఈ సినిమా యొక్క తదుపరి షెడ్యూల్ త్వరలో హైదరాబాద్ లో మొదలు కానుంది. ఈ నెలాఖరున సినిమా షూట్ తిరిగి ప్రారంభం కానుంది అని అనిల్ రావిపూడి ఇప్పటికే ప్రకటించాడు. అయితే ఈ సారి సినిమా షూటింగ్ కోసం ఒక ఇంపార్టెంట్ సెట్ వేస్తున్నారు.

ఈ సినిమా షూట్ కోసం కొండారెడ్డి బురుజు ని నిర్మిస్తున్నారు. కర్నూల్ లో ని ప్రధాన ఆకర్షణలో కొండారెడ్డి బురుజు కూడా ఒకటి. దాదాపు 4 కోట్లు పెట్టి దేనిని ప్రత్యేకం గా రామోజీ ఫిలిం సిటీ లో నిర్మిస్తున్నారు. ఈ సెట్ లో మహేష్ మరియు ఈ సినిమా హీరోయిన్ రష్మిక మీద కొన్ని లవ్ సీన్లని తీయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు.

కర్నూల్ లో ప్రధాన లొకేషన్లో షూట్ చేస్తే సినిమా షూట్ చూడటానికి, మహేష్ ని చూడటానికి వచ్చే జనాలని కంట్రోల్ చేయలేరు అనే ఈ నిర్ణయం తీసుకున్నారట. అనిల్ సుంకర, మరియు దిల్ రాజు కలిసి ఈ సినిమా ని నిర్మిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -