‘రంగస్థలం’తో సూపర్ హిట్తో మంచి జోష్లో ఉన్నా డైరక్టర్ సుకుమార్ తన తరువాత సినిమాపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది.ఈ దర్శకుడు తదుపరి ఎవరితో సినిమా చేయబోతున్నాడనే అంశంపై ఇది వరకూ కొన్ని వార్తలు వచ్చాయి. మొదట సుకుమార్తో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్నడని, చిరు కూడా సుకుమార్తో చేయడానికి ఆశక్తిగా ఉన్నారనే వార్తలు వచ్చాయి. కాని ఇది కేవలం రూమర్స్ మాత్రమే.సుకుమార్ తన తరువాత సినిమాపై మరో వార్త వెలుగులోకి వచ్చింది. సుకుమార్ తన తదుపరి సినిమాను ప్రిన్స్ మహేష్ బాబుతో చేస్తున్నాడని సమాచారం. రంగస్థలం ఊపు మీద సుక్కూ మహేష్ తో రాబోతున్నట్టుగా తెలుస్తోంది.వీరి కాంబినేషన్లలో ‘వన్ నేనోక్కిడనే’ అనే సినిమా వచ్చింది.
ఈ సినిమాకు దర్శకుడిగా సుకుమార్కు, నటనకు మహేష్ బాబుకి మంచి పేరు వచ్చింది కాని సినిమా పెద్దగా హిట్ కాలేదు.ఈ నేపథ్యంలో హిట్ లోటును తీర్చడానికి మహేష్ తో మళ్లీ జట్టుకడుతున్నాడట సుకుమార్. ప్రస్తుతం మహేష్ సినిమా ‘భరత్ అనే నేను’ విడుదలకు సిద్ధం అయ్యింది. మరోవైపు వంశీ పైడిపల్లితో మహేష్ ఒక సినిమాను చేయబోతున్నాడు.ఈ రెండు సినిమాలు ఓకేసారి చేయలని మహేష్ బాబు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.మరి దీనిపై ఇటు మహేష్, అటు సుకుమార్ క్లారీటి ఇవ్వాలి.