టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం భరత్ అను నేను సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్ది సినిమా ప్రమోషన్స్ పెంచలని చిత్ర యూనిట్ ప్లాన్.శ్రీమంతుడు సినిమా అంతటి అద్భుతం విజయం సాధించడం వెనక ఓ రహస్య మార్కెటింగ్ స్ట్రాటెజీ ఉంది. ఈ స్ట్రాటెజీ ప్లానర్ ఎవరో కాదు మహేష్ భార్య నమ్రత. నమ్రతా శిరోద్కర్ బాలీవుడ్ మోడల్ – హీరోయిన్ అని అందరికీ తెలిసిందే. ప్రిన్స్ చేసే ప్రతీ పనీ వెనక ఆమె పర్యవేక్షణ ఉంటుంది. యాడ్స్ ఎంపికలోనే కాదు సినిమాల ప్రమోషన్ విషయంలో కూడా ఆమె చెప్పిన డేట్లే ఫిక్స్ చేస్తాడు మహేష్. ఓ మార్కెటింగ్ టీంను తీసుకుని సోషల్ మీడియా ద్వారా శ్రీమంతుడు లోని సోషల్ పాయింట్ ను హైలెట్ చేస్తూ విసృతంగా ప్రచారం చేయించింది.
సినిమా కలెక్షన్లు డ్రాప్ అవ్వకుండా స్టడీగా కొనసాగేందుకు నమ్రత వ్యూహమే కారణం. తరువాత కుటుంబ విషయలలో పడి మహేష్ని పట్టించుకొలేదు నమ్రత. ఈలోపు మహేష్కు రెండు ప్లాప్లు వచ్చాయి.‘భరత్ అనే నేను’ సినిమాను ఎలాగైనా సక్సెస్ చేసేందుకు మళ్లీ మార్కెటింగ్ పగ్గాలు చేపట్టింది నమ్రతా. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 350 హోర్డింగులు పెట్టాలని నిర్మాతని ఆదేశించింది. హైదరాబాద్ లో ఏకంగా 200 హోర్డింగులను ఏర్పాటుచేయబోతోంది. ‘భరత్ అనే నేను’ చిత్రాన్ని బాక్సాఫీస్ దగ్గర రికార్డుల సృష్టించేలా పక్కా ప్రణాళికలు వేస్తుంది నమ్రత.