సూపర్స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న 25వ చిత్రం మహర్షి. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా పూజా హెగ్డె నటిస్తుంది. ఈ సినిమాను దిల్ రాజు – అశ్వనీ దత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా హిందీ శాటిలైట్ హక్కుల విషయంలో భారీ డీల్ కుదిరినట్టుగా తెలుస్తోంది. తెలుగు సినిమాలకి హిందీ మార్కెట్లో మంచి క్రేజ్ వుంది. తెలుగు సినిమాను హిందీలోకి డబ్ చేసి యూట్యూబ్ లో వదిలితే చాలు, కొన్ని గంటల్లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చిపడుతున్నాయి.
దాంతో హిందీ శాటిలైట్ హక్కుల నిమిత్తం ఎంత మొత్తం చెల్లించడానికైనా కొన్ని సంస్థలు వెనకాడటం లేదు. ‘మహర్షి’ హిందీ శాటిలైట్ హక్కులకు దిల్ రాజు 25 కోట్లు చెప్పారట. 20 కోట్లు చెల్లించడానికి ఒక సంస్థ ముందుకు రావడంతో, ఆయన ఆ డీల్ ను ఓకే చేసినట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాను వచ్చే వేసవికి విడుదల చేయాడానికి సన్నాహాలు చేస్తున్నారు.