దర్శకుడు మెహర్ రమేశ్ గుర్తుండే ఉంటాడు.అదేనండీ ఎన్టీఆర్తో శక్తి,ప్రభాస్తో బిల్లా సినిమాలు తీసింది మనోడే.ఇప్పుడు అతని గురించి ఎందుకనే కదా మీ అనుమానం.మెహర్ రమేశ్,మహేశ్ బాబు మంచి స్నేహితులు.మహేశ్ బాబు నటించిన బాబీ సినిమాలో నటించాడు బాబీ.మెహర్ రమేష్ ,మహేష్ ఫ్యామిలీతో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. ఈ నేఫధ్యంలో రీసెంట్ గా మహేష్ తో ఓ ఈవెంట్ ప్లానింగ్ కు అవకాసం ఇచ్చింది ఆ కుటుంబం. అయితే ఆ పోగ్రాం చివరి నిముషంలో కాన్సిల్ అయ్యింది. అందుకు కారణం మెహర్ రమేష్ పూర్ ప్లానింగ్ అని తెలుస్తోంది. టిక్కెట్లు అమ్ముడు పోకపోవటం వల్ల పోగ్రాం ఆగిపోయిందని తెలిసి మహేష్ ఫ్యాన్స్ చాలా నిరాశపడ్డారు.
ఇలా పోగ్రాం అర్దాంతరంగా ఆగిపోవటానికి కారణం మెహర్ రమేష్ ,ఆయన టీమ్ ప్రోపర్ ప్లానింగ్ లేకపోవటం, టిక్కెట్ రేట్లు ఎక్కువపెట్టడం అని చెప్తున్నారు. మొదట ఈ ఈవెంట్ని ప్రొఫెషనల్ ఈవెంట్ మేనేజర్స్ కు ఇద్దమనుకున్నారు. అయితే మెహర్ రమేష్ వెళ్లి నమ్రత ని కలిసి ఈవెంట్ని పెద్ద సక్సెస్ చేస్తామని ప్రామిస్ చేసి తనకు ఇమ్మని అడగటం జరిగింది. వారిని నమ్మిన నమ్రత , మెహర్ రమేష్ అండ్ టీమ్ కు అప్పచెప్పింది. ఈ సంఘటనతో మెహర్ రమేష్ పై నమ్రత చాలా సీరియస్ అయ్యిందని, మహేష్ బాబు రెప్యుటేషన్ పై ఈ ఇంపాక్ట్ పడుతుందని అప్ సెట్ అయ్యారని తెలుస్తోంది. మహేష్బాబు ప్రస్తుతం అమెరికాలో మహర్షి సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు.