‘బాహుబలి’ సినిమాను దృష్టిలో ఉంచుకొని కొంత వెనక్కు తగ్గాడు మహేశ్ బాబు. ఈ భారీ సినిమా విడుదలకు సహకరిస్తూ.. తన సినిమా విడుదలను కొంత వాయిదా వేసుకొన్నాడాయన.
ఈ సినిమాకు భారీ పెట్టుబడులు పెట్టినందునా.. బాహుబలి నిర్మాతలు ఆ డబ్బును రాబట్టుకోవడానికి వీలుగా ‘శ్రీమంతుడు’ విడుదల వాయిదా పడింది. మరి ఈ విధంగా కొంత గ్యాప్ అయితే వచ్చింది. ఈ గ్యాప్ లో మొత్తం సినిమాను చూసేశాడట మహేశ్.
మరి ఈ సినిమా ఎడిటెడ్ వెర్షన్ ను చూసిన మహేశ్ కు సినిమాలో కొన్ని మార్పులు చేస్తే మంచిదని అనిపించిందట. దీంతో మహేశ్ ‘శ్రీమంతుడు’ దర్శక నిర్మాతలను అందుకు తగ్గట్టుగా ప్రిపేర్ చేసినట్టు గా సమాచారం. కొన్ని సీన్లను రీషూట్ చేయించుకోవాలని మహేశ్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకు సంబంధించి ఇప్పటికే సూచనలు చేశాడట.. ఇప్పుడు సినిమా యూనిట్ ఆ ప్రయత్నాల్లోనే ఉన్నట్టుగా తెలుస్తోంది.
మహేశ్ సూచనలు విలువైనవిగా భావించి.. దర్శక నిర్మాతలు కూడా రీ షూట్ కు సమ్మతిని తెలిపినట్టుగా తెలుస్తోంది. మరి మరో వారం రోజుల్లో ‘శ్రీమంతుడు’ ఆడియో కూడా విడుదల కానుంది. ఇలాంటి నేపథ్యంలో.. రీ షూట్ అంటే.. అది ఆసక్తికరమైన విషయమే. ఇంతకీ మహేశ్ బాబు ఎలాంటి మార్పులను సూచించాడో..!