Wednesday, May 15, 2024
- Advertisement -

ప్రచారం ముగిసింది.. మహేశ్ ఫ్యామిలీతో టూర్ వెళ్లాడు!

- Advertisement -

ఆగస్టు ఏడో తేదీన ‘శ్రీముంతుడు’ సినిమా విడుదల అయ్యింది. అప్పటి నుంచి ఆ సినిమా ప్రచారంలో యమ బిజీగా గడిపేశాడు మహేశ్ బాబు.

తొలి సారి సొంతంగా నిర్మాతగా కూడా మారిన నేపథ్యంలో ఆయన ఈ సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి తీవ్రంగా కష్టపడ్డాడు. ఎన్నడూ లేనన్ని రీతిలో అనేక రకాలుగా సినిమాను ప్రమోట్ చేశాడు. కేవలం మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం.. ట్విటర్ ద్వారా ఈ సినిమా అనుభవాలను పంచుకోవడమే కాదు… ఇంకా అనేక రకాలుగా మహేశ్ శ్రీమంతుడు సినిమా ప్రచారంలో పాలు పంచుకొన్నాడు.

మరి రెండు వారాలు గడిచే సరికి ఎట్టకేలకూ ఆ హడావుడి తగ్గింది. మూడో వారంలో సినిమా ప్రచారాన్ని పూర్తిగా పక్కకు పెట్టాడు మహేశ్ . ఇప్పటికే ఆ సినిమా సేఫ్ జోన్ లోకి రావడం.. లాభాల బాట పట్టడంతో ఇక థియేటర్లలో మామూలుగా రన్ అయినా చాలని మహేశ్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకే ఆయన ఇప్పుడు రిలాక్సేషన్ కోసం ఫారెన్ వెళ్లాడు. 

ప్రస్తుతం మహేశ్ తన కుటుంబంతో కలిసి థాయ్ లాండ్ లో విహరిస్తున్నాడు. భార్యపిల్లలతో మహేశ్ ఈ విధంగా రిలాక్స్ గా గడుపుతున్నాడు! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -