Tuesday, May 14, 2024
- Advertisement -

అయ్యో :మహేశ్ కు 2022 అంతా చేదు జ్ఞాపకాలే!

- Advertisement -

ఈ ఏడాది సూపర్ స్టార్ మహేశ్ బాబు కి మిగిల్చిన దుఖం అంతా ఇంత కాదు. ఒక్కరూ కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురి కుటుంబ సభ్యులను దూరం చేసి మహేశ్ జీవితంలో అత్యంత చెత్త సంవత్సరంగా 2022 నిలిచింది. ఏ ఏడాది మొదట్లో మహేశ్ సోదరుడు రమేశ్ బాబు అనారోగ్యంతో జనవరి 8న మరణించారు. తన అన్న మరణంపై సర్కారు వారి పాట మూవీ సక్సస్ ఈవెంట్ లో ఎంతో ఎమోషనల్ అయ్యారు మహేశ్ బాబు. తనకు ఇష్టమైన వాళ్ళు దూరమయ్యారని, ఏది మారిన, మీ అభిమానం మాత్రం మారలేదంటూ అభిమానులతో తన బాధను పంచుకున్నాడు. ఇక తన అన్న మరణాన్ని మెల్ల మెల్లగా మర్చిపోతూ కెరియర్ పై దృష్టి పెడుతున్న తరుణంలో అనూహ్యంగా ఆయన తల్లి ఇందిరదేవి కూడా అనారోగ్యంతో సెప్టెంబర్ 28న కన్ను మూశారు. .

తల్లి మరణంతో మరోసారి మహేశ్ కుటుంబాన్ని విషాదం కమ్మెసింది. తల్లి మరణంతో తన కొత్త సినిమా షూటింగ్ కు కూడా బ్రేక్ ఇచ్చాడు మహేశ్. ఇక తన తల్లి మరణాన్ని మర్చిపోకముందే.. తాను ఆరాధ్యదైవంగా భావించే ఆయన తండ్రి కృష్ణ కూడా అనారోగ్యంతో ఇటీవల కన్ను మూశారు. దీంతో మహేశ్ బాబు దీంతో మహేశ్ జీవితాన్ని ఈ ఏడాది దుఖంతో కమ్మేసింది. ఈ ఏడాది మహేశ్ కెరియర్ లోనే అత్యంత దురదృష్టకరమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఇక మేహేష్ బాబు తండ్రి కృష్ణ మరణించడంతో ఆయన అప్ కమింగ్ మూవీ ” SSMB28 ” రిలీజ్ కూడా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మూవీని వచ్చే ఏడాది సమ్మర్ కనుకగా రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ భావించింది. అయితే ఇప్పుడు కృష్ణ మరణంతో షూటింగ్ కు బ్రేక్ పడే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికి మహేశ్ బాబు కు 2022 అత్యంత చేదు జ్ఞాపకంగా మిలిగిలిపోయింది.

ఇవి కూడా చదవండి

అల్లు అర్జున్ “ఐకాన్” సంగతేంటి ?

ఎన్టీఆర్ కృష్ణ మద్య విభేదాలు ఆ స్థాయిలో ఉండేవా?

చిరు బాలయ్యకు స్ట్రోక్ ఇస్తోన్న తలపతి విజయ్ ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -