‘మనం సైతం’ కార్యక్రమం టాలీవుడ్లో సహాయ కార్యక్రమాలు చేస్తోంది. కాదంబరి కిరణ్ చొరవతో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆపదలో.. ఇబ్బందుల్లో ఉన్న నటీనటులను ఆదుకోవడానికి ‘మనం సైతం’ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి సినిమా పెద్దలందరితో పాటు ఎంతో మంది సినీ నిర్మాత, దర్శకులు, నటీనటులు, టెక్నీషియన్స్ ఇలా అందరూ సహకరిస్తున్నారు. తమ వంతు సహాయం కూడా చేస్తున్నారు.
ఈ కార్యక్రమానికి మిల్కీబ్యూటీ తమన్నా తోడ్పాటు అందించింది. తనవంతు సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ‘మనం సైతం’ కార్యక్రమం పోస్టర్ను తమన్నా విడుదల చేసింది.
సినీ పరిశ్రమలో అండలేని వాళ్లను ఆదుకునేందుకు ‘మనం సైతం’లాంటి సంస్థను ప్రారంభించడం, వందలాది మందికి సహాయం అందించడం గొప్ప విషయమని తమన్నా అభినందించారు. ‘మనం సైతం’ సేవా కార్యక్రమాల్లో ఇకపై తానూ భాగస్వామి అవుతానని ప్రకటించింది. ఇండస్ట్రీలోని 24 విభాగాల కార్మికులకు ‘మనం సైతం’ అండగా నిలుస్తోంది.
కాదంబరి కిరణ్తో కలిసి టీషర్ట్ను తమన్నా విడుదల చేసింది. ఈ సేవా కార్యక్రమాలకు తన పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని తెలిపింది.