Friday, May 17, 2024
- Advertisement -

ఓ ప‌క్క నానమ్మ చ‌నిపోతే సినిమా ప్ర‌మోష‌న్స్‌లో మంచు ల‌క్ష్మీ బిజీ

- Advertisement -

మంచు కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది.మంచు మోహ‌న్ బాబు అమ్మ‌గారు గురువారం ఉద‌యం మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే.నానమ్మ చనిపోయిందంటూ మంచో మనోజ్ చేసిన ట్వీట్‌కు నెటిజన్లు త‌మ ప్ర‌గాఢ సానుభుతి తెలియ‌జేశారు.ఇది జ‌రిగిన కొంత‌సేప‌టికే మంచు ల‌క్ష్మీ చేసిన ట్వీట్‌పై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు.మంచు ల‌క్ష్మీ కాట్రిన్ మోఝీ చిత్రంతో త‌మిళ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. ‘తమిళంలో నా తొలి సినిమా ట్రైలర్ చూడకుండా ఉండలేకపోతున్నా. కాట్రిన్ మోఝీ ట్రైలర్ ఈ రోజు సాయంత్రం 4 గంటలకు రిలీజ్ అవుతుంద’ని మంచు లక్ష్మీ ట్వీట్ చేశారు. అంతే ఆమెపై ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు.

ఓ ప‌క్క నానమ్మ చ‌నిపోయింద‌ని బాధ లేకుండా ,ఇలా సినిమా ప్రమోష‌న్స్ గురించి ఆలోచించ‌డం చాలా దారుణం అని నెటిజ‌న్లు ఆమె ఫైర్ అవుతున్నారు.సినిమా ఈ రోజు కాక‌పోతే రేపు చూడ‌వ‌చ్చు,మ‌నిషి పోతే మ‌ళ్లీ తిరిగి రారు అనే భావ‌న లేకుండా మంచు ల‌క్ష్మీ ఇలా ప్ర‌వ‌ర్తించ‌డం చాలా సిగ్గ‌చేటు అని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు.ఇక కాట్రిన్ మోఝీ సినిమా విషయానికి వస్తే.. హిందీలో సూపర్ హిట్ అయిన ‘తుమ్హారీ సులు’కు ఇది రీమేక్. విద్యాబాలన్ పోషించిన పాత్రను తమిళంలో జ్యోతిక చేయగా.. నేహాధూపియా క్యారెక్టర్‌లో మంచు లక్ష్మీ నటించారు. ఈ సినిమా ద‌స‌రాకు విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -