మంచు మోహన్ బాబు కుతురు మంచు లక్ష్మీ పలు సినిమాలలో నటిస్తు తన కంటు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.మంచు లక్ష్మి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుందన్న సంగతి తెలిసిందే.తాజాగా ఆమెను ఇమిటేట్ చేస్తూ కొందరు వీడియోలు చేస్తున్నారటా!సోషల్ మీడియాలో తనపై వస్తోన్న నెగెటివ్ ట్రోలింగ్ పై ఫైర్ అయ్యారు.నా గురించి సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వస్తుంటాయి. అవి నా దృష్టికి కూడా వస్తాయి. అయితే చాలా లైట్ తీసుకునేదాన్ని. నా మాట గురించి, నేను వేసే బట్టల గురించి అయితే పట్టించుకోను.
కానీ నా పెర్సనల్ లైఫ్, అలానే నా కుటుంబాన్ని తక్కువ చేసి మాట్లాడితే గనుక సహించేది లేదు. కొందరైతే ఫోటోలు మార్ఫింగ్ చేసి మరీ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్లను చెప్పుతో కొట్టాలనిపిస్తుంది.అంత ధైర్యం ఉంటె నా ముందుకు వచ్చి మాట్లాడండి. అంతేకానీ ఫోన్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేస్తే ఊరుకునేది లేదని మంచు లక్ష్మి హెచ్చరించింది.మంచు లక్ష్మి ‘వైఫ్ ఆఫ్ రామ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉంది.ఇప్పటికే విడుదలైన టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది.