- Advertisement -
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్ప. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మోహన్ లాల్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలు నటిస్తుండగా విష్ణు సరసన ప్రీతి ముకుందన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది.
బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేయబోతున్నారు. గతంలో సునీల్ శెట్టి – మంచు విష్ణు కలిసి మోసగాళ్లు సినిమా చేయగా ఇప్పుడు తాజాగా రెండోసారి కలిసి నటిస్తున్నారు. సునీల్ శెట్టి పాత్ర కథలో చాలా కీలకం.
ఆదివాసీ తెగకు సంబంధించిన ఒక పాత్రలో మోహన్లాల్ మెరవనుండగా ప్రభాస్ మహా శివునిగా కనిపించనున్నాడని తెలుస్తోంది. పార్వతీ దేవిగా నయనతార కనిపించనుండగా మరిన్ని సర్ప్రైజ్లు ఉండనున్నాయని తెలుస్తోంది.