ఇటీవలే వివాహం చేసుకుని.. భర్తతో కలిసి మల్దీవుల్లో తెగ హల్ చల్ చేసిన దక్షిణాది టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్.. తాజాగా డబ్బెమనది కుమ్మెస్కో అంటూ మంచు వారి అబ్బాయి విష్ణుతో చిందులు వేస్తోంది. అదే ఎక్కడో అనుకుంటున్నారా? అదే నండి వెండితెరపైన ! ఇటీవల మంచు విష్ణుకు పెద్దగా హిట్ లేకపోవడంతో ఆయన సినీ కెరియర్ కొద్దిగా డీలా పడిందనే చెప్పాలి. ఇక ఇటీవల పెండ్లి చేసుకున్న అందాల చందమామ కాజల్.. మళ్లీ సినిమాల్లో బిజీ అయింది.
వీరిద్దరి కాంభినేషన్లో మోసగాళ్లు అనే సినిమా రాబోతుంది. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో జెఫ్రీ గీ చిన్ తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మళయాల, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సునీల్శెట్టి, నవదీప్, నవీన్చంద్ర, రుహీసింగ్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో ఓ ఐటీ కంపెనీ భారీ కుంభకోణం నేరస్తులను పట్టుకునే పవర్ఫుల్ పాత్రలో ఏసీపీ కుమార్ గా సునీల్ శెట్టి నటిస్తున్నారు.
చిత్ర యూనిట్ తాజాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించింది. దీనిలో భాగంగా ఈ సినిమాలోని డబ్బే మనది కుమ్మేస్కో అనే లిరికల్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సామ్ సంగీతంలో సింగర్ హేమచంద్ర పాడిన ఈ పాట ఆకట్టుకుంటోంది. చాలా కాలం నుంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న మంచు విష్ణుకు ఈ సినిమా ద్వారా అయిన విజయం దక్కుతుందో లేదో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.. !