ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి,నటసార్వభౌమ, నందమూరి తారక రామారావు జీవిత కథను ‘ఎన్టీఆర్’ పేరుతో సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను ఆయన తనయుడు, సీనియర్ హీరో బాలకృష్ణ స్వయంగా నటిస్తు,నిర్మిస్తున్నారు.ఎన్టీఆర్ బయోపిక్ క్రిష్ చేతులలోకి వెళ్లిన దగ్గర నుండి సినిమాకు మరింత క్రేజ్ ఏర్పడింది.సినిమాలోని కీలక పాత్రల కోసం స్టార్స్ తీసుకుని సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాడు.బసవతారకం పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ విద్యా బాలన్ నటిస్తుండగా చంద్రబాబు పాత్రలో రానా నటించబోతున్నారు.
ఏఎన్నార్ పాత్రలో అక్కినేని వారసుడు సుమంత్ నటించబోతున్నాడు. తాజాగా సినిమాలోని మరో పాత్ర కోసం హీరోయిన్ మంజిమా మోహన్ తీసుకున్నారని తెలుస్తుంది.నాగచైతన్య హీరోగా నటించిన సాహసం శ్వాసగా సాగిపో సినిమాతో తెలుగులో తెరంగేట్రం చేసిన మంజిమా మోహన్ …ఎన్టీఆర్ బయోపిక్లో చంద్రబాబు భార్య భువనేశ్వరిగా ఈ సినిమాలో కనిపించనుందని సమాచారం.తండ్రి బయోపిక్ను చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్న బాలకృష్ణ సినిమాను చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.