మెగా బ్రదర్ నాగబాబు తమ్ముడు పవన్ కల్యాణ్ కోసం తెగ కష్టపడిపోతున్నాడు. పవన్ కల్యాణ్ పార్టీ జనసేనను ఏపీలో అధికారంలోకి తీసుకురావడానికి నాగబాబు సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నాడు. దీనిలో భాగంగానే ఆయన పలు రాజకీయ నాయకుల మీద కామెంట్స్ చేస్తు సంచలనం సృష్టిస్తున్నాడు. ఇప్పటికే జగన్, లోకేశ్లను కామెంట్స్ చేసిన నాగబాబు తాజాగా ఏపీ సీఎం చంద్రబాబును టార్గెట్ చేసుకుని ఓ వీడియోను విడుదల చేశాడు నాగబాబు. కొద్ది రోజులు క్రితం చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడుతు బీజేపీ సభ్యులపై మండిపడ్డ సంగతి తెలిసిందే.
బీజేపీ తీరు చూస్తుంటే తన రక్తం మరుగుతోందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను తన వీడియోలో ప్రస్తావించారు నాగబాబు. పాలు మరగడానికి నాలుగున్నర నిమిషాలు పడితే మన సీఎం రక్తం మరగడానికి నాలుగున్నరేళ్లు పట్టిందని ఫన్నీగా తన వీడియోలో చెప్పుకొచ్చారు నాగబాబు. ఎక్కువ మంట పెడితేనే పాలు మరుగుతాయి. ఎలక్షన్లు వస్తేనే చంద్రబాబు రక్తం మరుగుతుంది. థ్యాంక్యూ సీఎం అంటూ సెటైర్లు వేశారు నాగబాబు. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్లో వైరల్గా మారింది.
- ఏపీ రేషన్ కార్డుదారులకు భారీ కానుక
- విజయ్ బాటలో చంద్రబాబు?
- ఆపరేషన్ తెలంగాణ…బీజేపీ ఫోకస్!
- బాలకృష్ణ NBK111.. సెట్ లోకి కాజల్ అగర్వాల్!
- గర్ల్ఫ్రెండ్ భర్తను చంపి.. ‘ప్రోగ్రామ్ ఓకే’ అని ప్రియుడి ఫోన్ కాల్..
