మెగా డాటర్ గా నిహారిక షాకింగ్ నిర్ణయం తీసుకోవడంతో మెగా అభిమానులు షాక్లో ఉన్నారు.కొణిదల వారసురాలు.. మెగా డాటర్ నిహారిక నటనకు గుడ్ బై చెప్పినట్టు తెలుస్తోంది. ‘ముద్దపప్పు ఆవకాయ్’ అనే వెబ్ సిరీస్తో పాపులర్ అయిన నిహారిక ‘ఢీ’ రియాలిటీ షోతో బుల్లితెరపైన మెరిసింది.
ఒక వైపున సొంత బ్యానర్లో వెబ్ సిరీస్ లు నిర్మిస్తూ .. నటిస్తూ, మరో వైపున సినిమాలపై దృష్టి పెట్టింది. తనకి నచ్చిన కథలకి మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ, ‘ఒక మనసు’ .. ‘హ్యాపీ వెడ్డింగ్’ .. ‘సూర్యకాంతం’ వంటి సినిమాలు చేసింది. అయితే చేసిన సినిమాలు ఆశించినంత విజయాలు అందుకోలేక పోవడంతో నటనకు గుడ్ బై చెప్పేయాలనే నిర్ణయానికి నిహారిక వచ్చేసిందనీ, ఈ విషయాన్ని తండ్రితోను చెప్పేసిందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. నిహారిక సినిమాల్లోకి వస్తున్నప్పుడే చాలా మంది మెగాఫ్యాన్స్ నుండి వ్యతిరేకత వ్యక్తం అయిన సంగతి తెలిసిందే.ఇక నటనకు స్వస్తి చెప్పి.. నిర్మాతగా మారనుందట నిహారిక.
నిహారిక సినిమాల్లోకి రాకముందు ఆమెకు పేరు తీసుకువచ్చిన వెబ్ సిరీస్తో తిరిగి పుంజుకునేందుకు నిర్మాత అవతారం ఎత్తబోతుందట నిహారిక. ఇప్పటికే పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బేనర్పై వెబ్ సిరీస్లు చేసిన నిహారిక ఇదే బ్యానర్లో సొంతంగా సినిమాలు చేయబోతుందట.