మెగా కాపౌండ్కు చెందిన ఇద్దరు హీరోలు ఒకేరోజున ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.మెగాస్టార్ మేనల్లుడిగా ఇండస్ట్రీకి పరిచియమైన సాయి ధరమ్ తేజ్ తక్కువ కాలంలోనే తనకంటు ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకున్నాడు.అయితే గత కొంతకాలంగా సరైన హిట్లు లేక ఇబ్బంది పడుతున్నాడు. సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం కరుణకరన్ దర్శకత్వంలో తేజ్ ఐ లవ్ యు చేశాడు.ఈ సినిమాను జులై 6న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.
ఇక చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అవుతున్న విజేత సినిమాను కూడా జులై 6నే విడుదల చేస్తున్నారు. గతంలో కూడా ఇలానే ఇద్దరు మెగాహీరోలు పోటీపడ్డారు. అప్పుడు కూడా సీన్ లో సాయిధరమ్ తేజ్ ఉన్నాడు. మరోవైపు వరుణ్ తేజ్ నిలిచాడు. సాయిధరమ్ తేజ్ నటించిన ఇంటిలిజెంట్, వరుణ్ తేజ్ నటించిన తొలి ప్రేమ సినిమాలు 24గంటల గ్యాప్ లో థియేటర్లలోకి వచ్చాయి. ఆ పోటీలో వరుణ్ తేజ్ విజేతగా నిలిచాడు. మరి జులై 6పోటీలో గెలుపెవరిదో చూడాలి.