Thursday, April 25, 2024
- Advertisement -

ఆకట్టుకుంటున్న‘ముగ్గురు మొనగాళ్లు’ ఫస్ట్ లుక్!

- Advertisement -

ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో పెద్ద సినిమాల కన్నా చిన్న సినిమాలే మంచి హిట్స్ అందుకుంటున్నాయి. భారీ అంచనాల మద్య రిలీజ్ అవుతున్న పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫల్టీలు కొడుతున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా వస్తున్న చిన్న సినిమాలు సూపర్ హిట్ అందుకుంటున్నాయి. ‘జాతిరత్నాలు’ సినిమా పెట్టుబడికి మించి ఎన్నోరెట్లు ఎక్కువగా వసూలు చేసింది. అదే తరహాలో రూపొందిన మరో సినిమా థియేటర్లు తెరవడమే ఆలస్యం రంగంలోకి దిగడానికి సిద్ధమవుతోంది.

‘గీతాంజలి’, ‘జయమ్ము నిశ్చయమ్మురా’ వంటి సినిమాలతో ఆకట్టుకున్న ప్రముఖ హాస్యనటుడు శ్రీనివాస్ రెడ్డి లీడ్ రోల్ గా అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో ‘ముగ్గురు మొనగాళ్లు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దీక్షిత్‌ శెట్టి , వెన్నెల రామారావు ప్రధాన పాత్రధారులుగా కనిపించనున్నారు. తాజాగా ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.అచ్యుత రామారావు నిర్మించిన ఈ సినిమాతో శ్రీనివాస్ రెడ్డి మరో విజయం అందుకుంటాడని చిత్ర యూనిట్ అంటున్నారు.

ఈ మూవీలో ఈ ముగ్గురు హీరోల్లో ఒకరికి కనిపించదు .. ఒకరికి వినిపించదు … మరొకరు మాట్లాడలేరు. ఆ విషయాన్ని స్పష్టం చేస్తూనే ఈ సినిమా పోస్టర్ ను ఇలా డిజైన్ చేసి వదిలారు. విలక్షణమైన కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంటోంది. ఈ ‘ముగ్గురు మొనగాళ్లు’ ఏ రేంజ్ లో మెప్పిస్తారో చూడాలి.

గొప్ప మనసు చాటుకున్న నవీన్ పోలిశెట్టి… అభిమానికి బిగ్ సర్ప్రైజ్

జబర్దస్త్ ఆనంద్‌ భార్యకు ఫుల్ సపోర్ట్ ఇచ్చిన రోజా.. ఏ విషయంలో అంటే?

కోవిడ్ బాధితులకు అండగా స్టార్ హీరోలు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -