తెలుగు ఇండస్ట్రీలో నవీన్ పొలిశెట్టి మొదట క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన కెరీర్ని ప్రారంభించినా తర్వాత “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యాడు.తాజాగా అనుదీప్ దర్శకత్వంలో కామెడీ బ్యాక్ గ్రౌండ్ లో రూపొందించిన సినిమా “జాతిరత్నాలు” ఈ మూవీలో నవీన్ పోలిశెట్ట,ఫరియా అబ్దుల్లా హీరో, హీరోయిన్లుగా నటించారు.ఈ మూవీ భారీ బడ్జెట్ సినిమాలకు దీటుగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడంతో తెలుగులో అవకాశాలు వెల్లువెత్తాయి.
ప్రస్తుతం కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలు ఆర్థికంగా, మానసికంగా కుంగిపోయి ఉన్నారు. వీరిని ఆదరించడానికి ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు వారికి తోచిన విధంగా ప్రజా సేవలో నిమగ్నమై ఉన్నారు. ఇదే కోవలో నవీన్ కూడా తన అభిమానికి సోషల్ మీడియాలో సర్ప్రైజ్ ఇచ్చాడు. కొన్ని రోజుల కిందట కరోనా బారినపడి తన తండ్రి కన్నుమూశారని,అప్పటి నుంచి తన తల్లి బాధతో కుంగిపోతోందని మే 5న సాయి స్మరణ్ అనే అభిమాని నవీన్ను ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ పెట్టాడు.
Also read:బుల్లితెరపై టాప్ 5 యాంకర్స్ వీళ్ళే!
ఆ ట్విట్టర్ ఖాతాలో జాతిరత్నాలు సినిమా చూసిన తర్వాత తన తల్లి ఆరోగ్యం బాగుపడిందని పేర్కొన్నారు సాయి స్మరణ్. విషయం తెలుసుకున్న నవీన్ పోలిశెట్టి. సాయి స్మరణ్ తల్లికి వీడియో కాల్ చేసి మాట్లాడగా ‘ఆతల్లి మనసారా నవ్వడం నాకు ఆనందం కలిగించిందని, ఈ సమయంలో బాధ నుంచి బయటపడడం కోసం ప్రేమ ఎంతో అవసరం. కాబట్టి అవసరమైన వారికి చేతనైనంత సాయం చేయండి’ అని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
Also read:ఆ సీక్రెట్ ఏంటని మహేష్ కాల్ చేసి మరి అడిగాడు: సుధీర్ బాబు