మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రతీష్టాత్మకంగా నటిస్తున్న చిత్రం సైరా. ఈ సినిమాలో చిరంజీవి ఊయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో కనిపించనున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నఈ సినిమాను రామ్ చరణ్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ను కొన్ని ముస్టిం సంఘాలు అడ్డుకోవడం సంచలనంగా మారింది. సైరా షూటింగ్ ప్రస్తుతం కర్ణాటకలోని బీదర్లో జరుగుతోంది. అయితే అక్కడ స్థానిక ముస్లిం యువకులు సినిమా షూటింగ్ను అడ్డుకున్నారు.
బీదర్లో బహమనీ కోటలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుటుంది. ఈ కోటలో ముస్లిం ప్రార్థనలు ఎక్కువుగా జరుగుతాయట. అలాంటి చోట సైరా సినిమా యూనిట్ హిందూ విగ్రహాలను పెట్టి షూటింగ్ చేస్తుండటంతో ముస్లిం యువకులు సినిమాను ఆపేయాలని ధర్నా చేశారట. షూటింగ్ కోసం పురాతత్వ శాఖ అనుమతి తీసుకున్నా,ముస్లిం యువకులు అడ్డుకున్నారు. పోలీసులు వచ్చి హిందూ విగ్రహాలను, సెట్ను తొలగించినట్టు సమాచారం. చిత్ర దర్శకుడితో పాటు, ప్రముఖ కన్నడ నటుడు సుదీప్ పై కేసు నమోదు చేయాలని పట్టుబట్టారు.ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయాని తెలుస్తోంది. అయితే చిరంజీవి ప్రస్తుతం అక్కడ లేరని సమాచారం.
- Advertisement -
చిరు ‘సైరా’ను ఆడ్డుకున్న ముస్లిం సంఘాలు
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -