Thursday, April 25, 2024
- Advertisement -

గాయని గా మారిన బాలకృష్ణ హీరోయిన్

- Advertisement -

ముస్కాన్ సేథీ అంటే త్వరగా గుర్తు పట్టడం కష్టమే కానీ బాలకృష్ణ పక్కన పైసా వసూల్ సినిమా లో నటించిన రెండో హీరోయిన్ అంటే ఈజీ గా గుర్తు పట్టేస్తారు ఈ హీరోయిన్ ని. పైసా వసూల్ పెద్దగా ఆడకపోవడం తో ఈ నటి కి పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ చిన్ని చిన్న సినిమా ఛాన్సులు మాత్రం బాగానే వచ్చాయి. ఇప్పుడు ఈ భామ త్వరలో తెలుగు లో విడుదల కానున్న ‘రాగల 24 గంటల్లొ’ అనే సినిమా లో నటిస్తుంది. అంతే కాకుండా ఈ సినిమా కోసం గాయని గా కూడా మారింది.

రఘు కుంచె సంగీత దర్శకత్వం లో రానున్న ఈ చిత్రం లో ఒక అద్భుతమైన మెలోడీ సాంగ్ ని ముస్కాన్ తో పాడించారట దర్శక నిర్మాతలు. ఈ సినిమా లో ముస్కాన్ తో పాటు సత్య దేవ్, ఈషా రెబ్బ కూడా నటించారు. శ్రీనివాస్ రెడ్డి దర్సకత్వం లో ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ముస్కాన్ పాడిన పాటను త్వరలో దర్శక నిర్మాతలు విడుదల చేయనున్నారు.

త్వరలో పూరి కనెక్ట్స నిర్మాణ సంస్థ నుండి రాబోయే ఒక సినిమా లో ముస్కాన్ నటించే అవకాశం ఉంది అని తెలుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -