Thursday, May 16, 2024
- Advertisement -

కేసీఆర్ మ‌ళ్లీ గెల‌వ‌లి – న‌టుడు ప్ర‌కాష్ రాజ్‌

- Advertisement -

న‌టుడు ప్ర‌కాష్ రాజ్ తెలంగాణ ఎన్నిక‌ల‌పై స్పందించారు.ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో టీఆర్‌ఎస్‌ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తప్ప తెలంగాణకు వేరే ప్రత్యామ్నాయం లేదని అభిప్రాయపడ్డారు. ప్రాంతీయ పార్టీలను సంఘటితం చేయడమే కేసీఆర్‌ ఉద్దేశమని కొనియాడారు. ప్రకాష్‌ రాజ్‌ ప్రముఖ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలంగాణ ఎన్నికలు, రాజకీయ పరిస్థితులపై పలు విషయాలు వెల్లడించారు. కేసీఆర్‌ రాజనీతిజ్ఞుడు… నిజమైన నాయకుడు. హోమం చేసిన కేసీఆర్‌ కొన్నిగంటల తర్వాత కార్యక్రమంలో మాట్లాడుతూ.. కులాలు, మతాలు చూసుకుని ఓట్లు వేయవద్దు అని చెప్పారు.

బీజేపీ, కాంగ్రెసేతర పార్టీల కూటములు కాదు. ప్రాంతీయ పార్టీలకు కేంద్రంలో అధికారం రావాలని’ ప్రకాష్‌ రాజ్‌ ఆకాంక్షించారు. చంద్రబాబు గొప్ప నాయకుడే. కానీ 15 సీట్లతో తెలంగాణలో సీఎం అవుతారా చంద్రబాబు. భవిష్యత్తులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య వివాదం వస్తే ఎటువైపు మొగ్గుచూపుతారని ప్రశ్నించాలి. ఆంధ్రాలో టీఆర్‌ఎస్‌ పోటీ చేస్తే ఎలా ఉంటుందో చంద్రబాబు ఆలోచించుకోవాలి. నేను ఏ పార్టీకి కార్యకర్తను కాను. కేసీఆర్‌ చెప్పినట్లుగా ప్రాంతీయ పార్టీలను బలపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయ‌న తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -