Sunday, May 19, 2024
- Advertisement -

కేర‌ళ దెబ్బ ‘శైలజా రెడ్డి’ మీద గ‌ట్టిగా ప‌డిందిగా..!

- Advertisement -

నాగ చైత‌న్య అను ఇమ్మాన్యుయేల్ హీరో,హీరోయిన్లుగా తెర‌కెక్కిన సినిమా శైలాజా రెడ్డి అల్లుడు.ఈ సినిమా కోసం అక్కినేని అభిమానులు ఎంత‌గానో ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా ఆగస్టు 31న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం.కాని ఈ సినిమా విడుద‌ల‌ను వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు హీరో నాగ‌చైత‌న్య‌.దర్శకుడు మారుతి ఈ సినిమా రీరికార్డింగ్ కోసం కేరళ వెళ్లారు. సంగీత దర్శకుడు గోపిసుందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

అయితే ఈ ఇద్దరూ కూడా కేరళ వరదల్లో చిక్కుకోవడంతో రీరికార్డింగ్ పని పూర్తి కాలేదని తెలుస్తోంది.పోస్ట్ ప్రొడక్షన్ పనులు అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడంతో సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు హీరో నాగచైతన్య ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.విడుద‌ల తేదీని త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని చైత‌న్య తెలిపాడు.ఇక ఈ సినిమాలో నాగ‌చైత‌న్య‌కు అత్త పాత్ర‌లో సీనియ‌ర్ హీరోయిన్ ర‌మ్య‌కృష్ణ న‌టిస్తుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -