- Advertisement -
నాగచైతన్య , అనూ ఇమ్మాన్యుయేల్ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం శైలజా రెడ్డి అల్లుడు.మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలకమైన పాత్రను పోషించారు.మొదటి ఈ సినిమాను ఈ నెల 31వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. అయితే కేరళలో రీ రికార్డింగ్ చేస్తోన్న గోపీ సుందర్, వరదల కారణంగా సకాలంలో తన పనిని పూర్తిచేయలేకపోయాడు.
దాంతో ఈ సినిమా ముందుగా అనుకున్నట్టుగా ఈ నెల 31వ తేదీన థియేటర్లకు రావడం లేదు. ‘వినాయక చవితి’ సందర్భాన్ని పురస్కరించుకుని వచ్చేనెల 13వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారనేది తాజా సమాచారం.