నాగచైతన్య,అను ఇమ్మాన్యుయల్ హీరో,హీరోయిన్లుగా మారుతి దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘‘శైలజా రెడ్డి అల్లుడు’’. ఈ సినిమాలో రమ్యక్రిష్ణ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా ట్రైలర్ను తాజాగా విడుదల చేశారు చిత్ర యూనిట్.నాగచైతన్య తన గురించి తాను చెబుతున్నట్లు సినిమా ట్రైలర్ మొదలైంది.రమ్యకృష్ణ, అను ఇమ్మాన్యుయల్ ల మధ్య నాగ చైతన్య నలిగిపోతాడనే విషయం ట్రైలర్ని చూస్తే అర్థమౌతోంది.పృథ్వీ, వెన్నెల కిశోర్ ల పాత్రలకు కూడా స్కోప్ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
‘‘ ఆవకాయని అన్నంలో కలుపుకొని తినాలి గానీ.. ఎర్రగా ఉంది కదా అని ముఖానికి పూసుకోకూడదు’ అంటున్నారు అంటు వెన్నెల కిషోర్ చెప్పే డైలాగ్ ట్రైలర్కే హైలెట్గా నిలిచింది.ఈ సినిమాను వచ్చే నెల 13న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఈ సినిమా తనకు తప్పకుండా విజయం అందిస్తుందని నాగచైతన్య ఆశాభావంతో ఉన్నాడు.