అక్కినేని హీరో నాగచైతన్య ఇటీవలే శైలాజారెడ్డి అల్లుడు సినిమాతో కూల్ హిట్ కొట్టాడు.ప్రస్తుతం నాగచైతన్య నటిస్తున్న చిత్రం సవ్యసాచి.చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నా ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ప్రేమమ్ సినిమా మంచి విజయం సాధించింది.ఇప్పటికే విడుదల చేసిన టీజర్కు మంచి రెస్పన్స్ వచ్చింది.తాజాగా సినిమాలో మొదటి పాటను విడుదల చేశారు చిత్ర యూనిట్.
ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాలో ‘వై నాట్’ అనే లిరికల్ సాంగ్ ని విడుదల చేశారు. ఈ పాట విన్న చైతు అభిమానులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తుంది.కొత్త కాన్సెప్ట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.సినిమాను వచ్చే నెల విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.