అక్కినేని హీరో నాగ చైతన్య మంచి జోషలో ఉన్నాడు.నాగ చైతన్య ఇటీవలే నటించిన శైలాజా రెడ్డి అల్లుడు సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.తాజాగా నాగ చైతన్య నటించిన కొత్త సినిమా సవ్యసాచి సినిమా టీజర్ను విడుదల చేశారు చిత్ర యూనిట్.చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. “మాములుగా ఒక తల్లి రక్తం పంచుకుని పుడితే అన్నదమ్ములంటారు. అదే ఒకే రక్తం .. ఒకే శరీరం పంచుకుని పుడితే దాన్ని అద్భుతం అంటారు. అలాంటి అద్భుతానికి మొదలుని .. వరుసకి కనిపించని అన్నని .. కడదాకా వుండే కవచాన్ని .. ఈ సవ్యసాచిలో సగాన్ని” అంటూ చైతూ వాయిస్ పై టీజర్ ను కట్ చేశారు.
టీజర్ను చూస్తుంటే సినిమా కొత్తగా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని అర్థం అవుతుంది.సినిమాలో హీరోయిన్గా నిధి అగార్వాల్ నటిస్తుంది.భూమిక ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తుందని సమాచారం. ఒక్కప్పటి లవర్ బాయ్, హీరో మాధవన్ ఈ సినిమాలో విలన్గా కనిపించనున్నాడు.త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.గతంలో నాగచైతన్య,చందూ మొండేటి కాంబినేషన్లో వచ్చిన ప్రేమమ్ సినిమా సూపర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే.దీంతో ఈ కాంబినేషన్పై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఎప్పటి నుంచో మాస్ హీరో కోసం ట్రై చేస్తున్న నాగ చైతన్యకు ఈ సినిమా అయిన కమర్షియల్ హిట్ ఇస్తుందు లేదో చూడాలి.