Friday, May 10, 2024
- Advertisement -

చిరంజీవి, అర‌వింద్‌పై నాగ‌బాబు షాకింగ్ కామెంట్స్‌

- Advertisement -

ఈ మధ్య ఏం అంశంపైనైనా మొహ‌మాటం లేకుండా స్పందిస్తున్న సీనిన‌టుడు నాగబాబు మ‌రోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. చిరంజీవి ఓ చోటారాజ‌న్‌.. అల్లు అర‌వింద్ ఓ దావూద్ ఇబ్ర‌హీం అన్నారు. ఇంత‌కీ విష‌య‌మేమిటంటే.. సినీ రంగం నలుగురు పెద్దల చేతిలో ఉందనే వార్తలపై ఆయ‌న వెరైటీగా స‌మాధానం ఇచ్చారు. సురేష్ బాబు ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ ఈ నలుగురు… మరోవైపు డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు, అల్లు అరవింద్… ఇంతకు మించిన పెద్ద మాఫియా ఎవరుంటారని ఓ సెటైర్ వేశారు. తామే పెద్ద మాఫియా అని… తన అన్నయ్య చిరంజీవి ఓ చోటా రాజన్ అని, అల్లు అరవింద్ ఓ దావూద్ ఇబ్రహీం అంటూ అన్నారు. అదీ విష‌యం.

ఈ నలుగురి చేతుల్లోనే పరిశ్రమ ఉన్నట్టయితే.. వారికి కూడా ఫ్లాప్ లు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. కొన్ని థియేటర్లు అరవింద్, దిల్ రాజుల చేతుల్లో ఉన్నప్పటికీ… తమ చేతిలో పవర్ ఏమీ ఉండదని చెప్పారు. చిన్న సినిమాలు విడుదల కాకపోవడమనేది డిస్ట్రిబ్యూటర్లకు సంబంధించిన అంశమని నాగబాబు అన్నారు. ఫలానా వాళ్ల సినిమా విడుదల అవుతోంది, వేరే సినిమాను విడుదల కాకుండా ఆపండని సినీ పెద్దలు ఎవరూ అనరని చెప్పారు. ఈ నిర్మాత‌ల‌ను కాద‌ని వారికి సినిమా తీసుకునే ధైర్యం ఉందా? అలాంటి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఉండ‌దు లేండి.

పనిలో ప‌నిగా ఆయ‌న ఓ స‌ల‌హా కూడా ఇచ్చారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్యలో పెద్దగా సినిమాలు రిలీజ్ కావని… ఇలాంటి సమయంలో చిన్న సినిమాలను విడుదల చేసుకోవచ్చు కదా? అని నాగబాబు అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -