Friday, May 3, 2024
- Advertisement -

వివాదాల మధ్య నాగార్జున

- Advertisement -

టాలీవుడ్ కింగ్ నాగార్జున మరియు రకుల్ ప్రీత్ తాజాగా రెడ్ ఎఫ్ఎం లో తమ ‘మన్మధుడు 2’ సినిమా నుండి ఒక పాటను విడుదల చేశారు. నిజానికి చాలా వరకు రేడియో స్టేషన్లు సినిమా ప్రమోషన్ లకి దూరంగా ఉంటాయి. హైదరాబాద్ ఎఫ్ఎమ్ రేడియో స్టేషన్ మరియు ప్రొడ్యూసర్స్ ఎల్ ఎల్ పి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో నాగార్జున రెడ్ ఎఫ్ ఎం రావడం అందరిని ఆశ్చర్య పరిచింది. ఈ నేపథ్యంలో నాగార్జున ప్రొడ్యూసర్స్ ఎల్ ఎల్ పి కి వ్యతిరేకంగా వెళ్తున్నాడా అనే అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి.

మరోవైపు నాగార్జున కేవలం తన సినిమా ప్రమోషన్ల పైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఏదేమైనా ప్రమోషన్ మాత్రం సినిమా ఓపెనింగ్ డే కలెక్షన్స్ పై ప్రభావం చూపిస్తున్నాయి. ప్రమోషన్ల హడావుడి ఎంత ఎక్కువగా ఉంటే సినిమా కలెక్షన్లు కూడా అంతే ఎక్కువగా ఉంటున్నాయి. మరోవైపు రేడియో స్టేషన్ కి వ్యతిరేకంగా రెఫ్ ఎఫ్ ఎం వారు నాగార్జున తో చేతులు కలపడం కూడా అనుమానాలకు దారితీస్తోంది. సినిమా స్టార్లు రావడం అంటే ప్రేక్షకులు కచ్చితంగా ఆసక్తి చూపిస్తారు. అయితే మరో వైపు ఈ సినిమా నిర్మాత జెమిని కిరణ్ రెడ్ ఎఫ్ ఎం వారికి బాగా క్లోజ్ అని తమ సినిమా ప్రమోషన్ కోసం భారీ మొత్తాన్ని ఇచ్చినట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -