- పూజలు లేకుండానే నాగార్జున-వర్మ కంపెనీ సినిమా ప్రారంభం
‘శివ’ సినిమాతో అద్భుత విజయవం సాధించిన జోడి అక్కినేని నాగార్జున, రామ్గోపాల్వర్మ. ఈ జోడి మళ్లీ కలిసింది. అదే సినిమాకు సీక్వెల్గా ఇప్పుడు ‘కంపెనీ’ సినిమా తీస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది. అయితే ఈ సినిమా ప్రారంభ కార్యక్రమాలు పూజలతో మొదలు కాలేదు. వర్మ తనకు తాను నాస్తికుడిగా భావిస్తాడు. అందుకే పూజాది కార్యక్రమాలు చేయలేదు. దీన్ని నాగార్జున కూడా సమర్థించి షూటింగ్ ప్రారంభించారు. అప్పట్లో ‘శివ’ సినిమా షూటింగ్ను ఎక్కడైతే ప్రారంభించారో ఆ గ్లాస్ హౌస్లోనే ఈ సినిమా షూటింగ్ తొలి షాట్ తీశారు. శివ సినిమాలో సైకిల్ చైన్ సీన్ ఆ సినిమాకే హైలెట్. అందుకే దాని జ్ఞాపకంగా మొత్తం సెట్ చైన్లతో ప్రత్యకంగా డిజైన్ చేశారు. ఆ సెట్లో నాగార్జునపై తొలి షాట్ను చిత్రీకరించారు. ఆ చైన్ సెట్టింగ్ మధ్యలో వీరి షూటింగ్ విశేషాలు వచ్చేలా ఓ స్క్రీన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుత షూటింగ్ కూడా ఈ సెట్టింగ్లోనే జరిగింది.
తనకు మైండ్ దొబ్బిందని, మిగతావి ఈ సినిమా తరువాత తెలుస్తాయని ‘కంపెనీ’ ముహూర్తపు షాట్ సందర్భంగా రాంగోపాల్ వ్యాఖ్యలు చేశాడు. “నాకు మైండ్ దొబ్బలేదు… నా మైండ్ బాగానే ఉంది” అంటూ వేదికపై నుంచే నాగార్జున కౌంటరిచ్చాడు. ఈ చిత్రం తనకు చాలా ఎక్జాయిట్మెంట్ను కలిగిస్తోందని, రెగ్యులర్ షూటింగ్ కు ఎప్పుడెప్పుడు వెళ్దామా అని ఉందని చెప్పాడు. ఇవాళ పొద్దున్నే 4గంటలకే ఆత్రంగా లేచా. రోజూ ఇలాగే ఉంటే బాగుంటుందని భావించినట్లు తెలిపాడు. సినిమా హిట్ అవుతుందా? హిట్ అవదా? అనేది ‘శివ’ సమయంలో అనుకోలేదని, ఇప్పుడు కూడా అనుకోవడం లేదని చెప్పాడు. ఓ గట్టి నమ్మకంతో ఈ సినిమాను ప్రారంభించానని చెప్పాడు. వర్మకు తనపై, తనకు వర్మపై నమ్మకం ఉందని, అందువల్లే సినిమాకు ఓకే చెప్పానని ప్రకటించారు.