నటుడు, టీడీపీ మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ మరణంతో ఆయన ఇంట్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. హరికృష్ణ మరణం తరువాత బాలకృష్ణ తన అన్నయ్య కుటుంబానికి దగ్గరైనట్లు కనిపించారు. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్, బాలకృష్ణ కలిసి భోజనం చేస్తోన్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీంతో ఎన్టీఆర్, బాలకృష్ణల నడుస్తోన్న కోల్డ్ వార్ ముగిసిందని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కొందరు ఔత్సాహికులు ఓ అడుగు ముందుకేసి ఎన్టీఆర్ నటిస్తోన్న ‘అరవింద సమేత’ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమానికి బాలకృష్ణ అథితిగా వస్తాడని వార్తలు వస్తున్నాయి.
ఈ నెల 20న ఈ వేడుక హైదరాబాద్ లో జరగనుంది. ఈ వేడుకకు బాలయ్య వస్తాడనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. అయితే ఈ ఆడియో ఈవెంట్కు బాలకృష్ణ రావడం కష్టమేనని తెలుస్తుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న అరవింద సమేత దసరాకు కానుకగా విడుదల చేయనున్నారు. పూజా హెగ్డె, ఈషా రెబ్బాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.