Monday, April 29, 2024
- Advertisement -

ముస్లిం సోదర సోదరీమణులకు బాలయ్య శుభాకాంక్షలు

- Advertisement -

నేడు (మే 14) రంజాన్ పర్వదినం.. అయితే కరోనా మహమ్మారి కారణంగా ముస్లిం సోదర సోదరీమణుల ఈ పర్వదినాన్ని ఇంటి వద్దనే జరుపుకుంటున్నారు. కరోనా కల్లోలం నేపథ్యంలో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో కరోనా లాక్ డౌన్ కొనసాగుతుంది. అందుకే ముస్లిం సోదర సోదరీమణుల ఇంటి వద్దనే ప్రార్థనలు, పండుగ చేసుకోవాలని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. అయితే పలువురు సినీ సెలబ్రెటీలు ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

తాజాగా నటసింహ, హిందూపూర్ ఎమ్మెల్యే, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ పవిత్ర పర్వదిన శుభాకాంక్షలు.. త్యాగానికి, సేవా నిరతికి మారుపేరు రంజాన్ పవిత్రమాసం.

భక్తిశ్రద్ధలతో, కఠిన ఉపవాస దీక్ష ఉంటూ దేవున్ని కొలవడం ఆదర్శప్రాయం.. అల్లా కృపాకటాక్షాలతో ఈ రంజాన్ పర్వదినం మీ అందరి జీవితాల్లో క్రొత్త వెలుగులు నింపాలని, అందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని.. స మీ అందరికీ నా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ.. మీ బాలకృష్ణ.. అంటూ వీడియో ద్వారా రంజాన్ శుభాకాంక్షలు చెప్పారు బాలయ్య.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -