టాలీవుడ్లో మరో క్రేజి కాంబినేషన్కు తెరలేపారు హీరో బాలకృష్ణ. దాదాపు 16 సంవత్సరాల తరువాత దర్శకుడు వివి. వినాయక్తో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు బాలయ్య.2002లో వినాయక్ దర్శకత్వంలో చెన్నకేశవ రెడ్డి సినిమాలో నటించారు బాలయ్య, 16 ఏళ్ల తరువాత మరోసారి అదే కాంబినేషన్ రిపీట్ కానుంది. జై సింహా సినిమాను నిర్మించిన సీ కల్యాణ్ బ్యానర్లో ఈ సినిమాను చేయనున్నాడు బాలయ్య.
బాలకృష్ణ ప్రస్తుతం తేజ దర్శకత్వంలోఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో నటిస్తున్నారు. చెన్నకేశవ రెడ్డి సినిమా యావరేజ్ టాక్తో నడిచినప్పటికి సినిమాలో బాలయ్య యాక్షన్కు మంచి పేరు వచ్చింది. ఈ సారి ఏలాగైనా బాలయ్యకు హిట్ ఇవ్వలనే కసితో ఉన్నాడు వినాయక్.ఇంటిలిజెంట్ ఫ్లాప్తో డీలా పడ్డా వినాయక్కు బాలకృష్ణ అవకాశం ఇవ్వడంతో సినిమా హిట్ చేయలని పట్టుదలతో ఉన్నాడు వివి వినాయక్.