నాని పట్టిందల్లా బంగారమే తీసిన ప్రతి సినిమా హిట్టే మొన్నటి వరకు కాని ఒక్క కృష్ణార్జున యుద్ధం సినిమా వచ్చి నాని అంచనాలను తలకిందులు చేసింది. సినిమా యావరేజ్ టాక్తో అయిన నడుస్తుంది అనుకుంటే మరి దారుణంగా ప్లాప్ అయింది. నాని సినిమాలలో ప్రేక్షకులు ఏం ఆశిస్తారో అవి లేకపోవడంతో చాలా నిరాశకు గురైయ్యారు. నాని ఈ సినిమాతో మాస్ ఆడియోన్స్కి దగ్గర కావలన్న ప్రయత్నం ఫెయిల్ కావడంతో నాని తన తరువాత సినిమాలపై ఆలోచనలో పడ్డాడు అని సమాచారం.కృష్ణార్జున యుద్ధం సినిమా బాగున్నప్పటీకి ఇది నానికి సరిపొయ్యే స్టోరి కాదని చాలామంది అభిప్రాయపడ్డారు.
దీంతో కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు నాని. అందులో భాగంగానే ఆయన విక్రమ్ కుమార్ ప్రాజెక్టును ఆపేశాడని సమాచారం. తనకి ఒకటి రెండు సక్సెస్ లు పడిన తరువాత ఆలోచిస్తాననీ, అప్పటివరకూ ఈ ప్రాజెక్టును పెండింగ్ లో పెట్టాలనుకుంటున్నానని అన్నాడట. అలా విక్రమ్ కుమార్ ప్రాజెక్టుకు రెడ్ సిగ్నల్ చూపించాడని చెబుతున్నారు..పైగా విక్రమ్ కూడా హలో సినిమా ప్లాప్ కావడం కూడా నాని ఈ దర్శకుడిని పక్కన పెట్టినట్లు తెలుస్తుంది.