హలో దర్శకుడితో తదుపరి సినిమా
ప్రిన్స్ మహేశ్బాబు సోదరి మంజుల ఘట్టమనేని నిర్మాణంలో న్యాచురల్ స్టార్ నాని నటించనున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. మంజుల ఇందిర ప్రొడక్షన్స్ బ్యానర్ను నిర్వహిస్తూ పలు సినిమాలను తీశారు. ఇప్పుడు తన సినిమాలను వేగంగా చేయాలని నిర్ణయించుకుంది. దీనిలో భాగంగా డిసెంబర్ 12వ తేదీన సందీప్కిషన్తో చేసిన ఓ సినిమా టీజర్ను విడుదల చేశారు. నాగచైతన్య, సమంత నటించిన ఏం మాయ చేశావే సినిమా తర్వాత మళ్లీ కనిపించలేదు.
ఇప్పుడు నానితో ఓ సినిమా చేయాలని ఆమె నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్పై నాని నటిస్తారని టాక్. ఈ సినిమాకు విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తాడట. ఇప్పటికే నానిని కలిసిన విక్రమ్ కె కుమార్ మంచి కథ వినిపించాడట. కథ నచ్చేయడంతో.. వెంటనే సినిమాకు ఓక చెప్పాడట. ప్రస్తుతం ఎంసీఏ మూవీ విడుదల కోసం ఎదురుచూస్తున్న నాని తన ఇంకో సినిమాను ముగింపు దశకు తీసుకొచ్చేశాడు. ఆ తర్వాత సినిమా మంజుల, విక్రమ్ కె కుమార్ సినిమానే నటిస్తాడట.
ప్రస్తుతం నాని ఎంసీఏ, కృష్ణార్జున యుద్ధం సినిమాలు ఉన్నాయి. ఎంసీఏ పూర్తయినా కృష్ణార్జున యుద్ధంలో సినిమాను పూర్తిచేసే పనిలో పడ్డాడు. అయితే ఈ సమాచారం ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది.